తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS May 23,2025 09:50 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 72 వేల 579 మంది భక్తులు దర్శించుకున్నారు. 34 వేల 67 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా పడుతుందన్నారు.