మే 24న డయల్ యువర్ ఈవో
NEWS May 23,2025 08:20 am
టిటిడి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం మే 24వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.