ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయట పడ్డాయన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిని కూతురు కవితనే తప్పు పడుతోందన్నారు. ఇక ఆయన చెప్పే మాటలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమయ్యారని కవితనే చెబుతోందన్నారు. బీఆర్ఎస్ సభలో బీజేపీ గురించి మాట్లాడక పోవడాన్ని ప్రశ్నించిందన్నారు. వీటన్నింటికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.