రూ. 77,249 కోట్లు ఎవరి కోసం..?
NEWS May 23,2025 07:53 am
మాజీ సీఎం జగన్ రెడ్డి ఏపీ కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరి కోసం అమరావతి నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టడం, ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం తప్పితే ఏపీకి చేసింది ఏముందంటూ నిలదీశారు. జుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్లు తీసేశారెందుకని ప్రశ్నించారు. ఐకానిక్ టవర్ల నిధులపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత భవనాలు కట్టి నిధులు గంగపాలు చేశారని ప్రశ్నించారు.