ఏపీలో వినూత్నంగా మాట మంతి
NEWS May 23,2025 07:48 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట మంతి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాట పౌరులు, నాయకత్వం మధ్య ప్రత్యక్ష, ప్రతిస్పందనాత్మక సంభాషణను సృష్టించడం ద్వారా భాగస్వామ్య గ్రామీణాభివృద్ధిని మరింతగా పెంచే దిశగా దీనిని రూపొందించినట్లు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ వెల్లడించింది. దీని వల్ల పూర్తి పారదర్శకత అనేది వస్తుందని పేర్కొంది. ఈ వినూత్న చొరవ ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని, గ్రామీణ సమాజాలతో కనెక్ట్ అవ్వడానికి, వారి సమస్యలను నిజ సమయంలో పరిష్కరించడానికి ఉపయోగ పడుతుందని తెలిపింది.