హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. 24 మందితో ఫైనలిస్ట్స్ జాబితాను ప్రకటించింద మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ. ఇందులో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు చోటు దక్కింది. ఇవాళ నిర్వహించనున్న కీలకమైన పోటీలో టాప్ 10 ని ఎంపిక చేయనున్నారు. మే 31న హెచ్ ఐ సీసీలో జరగనున్న ఫైనల్ పోటీలో పాల్గొంటారు వీరంతా.