విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు
NEWS May 23,2025 07:37 am
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 257 వరకు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం .ఆమెతో పాటు భర్త, పిల్లలకు RTPCR పరీక్షలు చేశారు వైద్యులు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఈ విషయం తెలియడంలో చుట్టు పక్కల ఉన్న వారందరికీ కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.