ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం
NEWS May 22,2025 05:46 pm
ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ఉత్తమ ఎస్ హెచ్ ఓగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని డీజీపీ ప్రకటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ఐని కలిసి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో 10 పీఎస్ లను ఎంపిక చేస్తే అందులో ఇది కూడా ఉండడం తమకు గర్వకారణంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడిమ్యాల దీపక్ రాజ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్, ఎన్ఎస్ యుఐ కార్యదర్శి చీమల రాజు, మాజీ ఎంపీటీసీ తిమ్మని రాములు పాల్గొన్నారు.