విజయసాయి రెడ్డిపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటును అమ్మేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనై ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారని అన్నారు. ఎవరున్నా లేక పోయినా వైసీపీ బలంగానే ఉంటుందన్నారు. అంతా ఆ దైవమే చూసుకుంటుందన్నారు.