దేశ వ్యాప్తంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. కర్ణి మాత ఆశీస్సులతో వికసిత్ భారత్ సాధనలో ముందుకెళ్తామన్నారు. అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లకు అమృత్ భారత్ అని నామకరణం చేశామని చెప్పారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.