కాల్పుల విరమణపై జై శంకర్ క్లారిటీ
NEWS May 22,2025 10:47 am
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కాల్పుల విరమణపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా భారత్, పాక్ కలిసి చర్చించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య మాత్రమే చర్చలు జరిగాయని, వేరెవ్వరి జోక్యాన్ని తాము సహించ బోమంటూ స్పష్టం చేశారు . ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం చేసింది తానేనని ఇప్పటికే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.