తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేసింది.పెండింగ్ లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది. ఈ విడతలో రూ. 10 లక్షల లోపు బిల్లుల చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లులకు నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో పాటు ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు విడుదల చేసింది.