నోటీసులు ఇస్తే తప్పకుండా హాజరవుతా
NEWS May 22,2025 09:36 am
ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందలేదన్నారు. తనకు వస్తే తప్పకుండా హాజరవుతానని, చట్టం పట్ల తనకు గౌరవం ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణమంతా ఆర్థిక శాఖతో ముడిపడి ఉండదన్నారు. కమిషన్ దగ్గర సమాచారమంతా ఉన్నాక తాము వచ్చి ఏం చేస్తామంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తప్పకుండా లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కారకులైన వారికి తప్పకుండా శిక్ష పడాలన్నారు.