ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
NEWS May 22,2025 09:02 am
ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షం వల్ల విమానం ముందు భాగం దెబ్బ తినడంతో భయాందోళనతో కేకలు వేశారు ప్రయాణికులు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫ్లైట్ లో 227 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు.