గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
NEWS May 22,2025 12:58 am
మెట్ పల్లి మండలం ఆత్మనగర్ గ్రామం ఆత్మనగర్ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేశారు,1500 లీటర్ల వాష్ను ధ్వంసం చేశారు. నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐతో విశాల్, ప్రణయ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.