రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు దారులకు రేపు ఇంటర్వ్యూ
NEWS May 22,2025 12:59 am
రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఈ రోజు 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో కోరుట్ల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఎంపీడీవో ఓదెల రామకృష్ణ కోరారు. SC, EBC, మైనారిటీ కార్పొరేషన్ల వారికి ఇంటర్వ్యూలు చేస్తామన్నారు. అప్లికేషన్ ఫారం, ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ ధృవపత్రాలు, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్ కార్డు, 2 ఫొటోలతో రావాలని సూచించారు.