అకాల వర్షానికి ధాన్యం తడిచి ముద్దయింది
NEWS May 22,2025 01:01 am
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుల తరబడి ధాన్యం అమ్మకాల కోసం కర్షకుల కష్టాలు తప్పడం లేదు. నెల రోజులుగా కొనుగోలులో జాబ్ జరుగుతుందని, రోజుల తరబడి కుప్పల వద్ద పడుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులో ఉన్న ధాన్యం కుప్పలతో పాటు సంచులు కూడా తడిసి ముద్దయ్యాయి. తెల్లవారుజామున రైతులు కుప్పల వద్దకు వచ్చి నీటిని తోడుతూ అవస్థలు పడ్డారు.