సోనియా..రాహుల్ లబ్ది పొందారు - ఈడీ
NEWS May 21,2025 08:19 pm
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ ఇద్దరూ తల్లీ కొడుకులు నేషనల్ హెరాల్డ్ కేసులో పెద్ద ఎత్తున లబ్ది పొందారని పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డారని రూ. 142 కోట్లు లబ్ది పొందారని ఆరోపించింది దర్యాప్తు సంస్థ.