తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరును మార్చుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పొట్టి శ్రీరాములుకు బదులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వ విద్యాలయంగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.