తమ ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్నను దర్శించు కోవడానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాలినడకన తరలివస్తున్నారు. 'ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ అంటూ భజనలు చేసుకుంటూ కొండపైకి చేరుకుంటున్నారు. నియమ నిష్ఠలతో ఆచరించిన దీక్షలను ఆంజనేయ స్వామి సన్నిధిలో విరమణ చేసి, ముడుపులు సమర్పించి, అంజన్నను దర్శించుకుంటారు.