కాళేశ్వరం కమిషన్ నోటీసులకు భయపడం
NEWS May 21,2025 01:32 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లాగా తేలి పోతాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.