తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS May 21,2025 09:16 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 76 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 766 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు కొనసాగుతోందన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.