ధోనీ పాదాలను తాకిన వైభవ్ సూర్యవంశీ
NEWS May 21,2025 08:50 am
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా చెన్న సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ సూపర్ షో చేసింది. కేవలం 17.1 ఓవర్లలోనే దుమ్ము రేపింది. చెన్నైకి ఝలక్ ఇచ్చింది. గౌరవ ప్రదంగా 18వ ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది. భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ఆకాశమే హద్దుగా రెచ్చి పోయారు.