ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ దురుద్దేశంతో, కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఖండించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేట తెల్లమైందన్నారు.