ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ఆరోపించారు. రూ.3700 కోట్ల లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా జగన్ ఇంటికి వెళ్లిందన్నారు. రూ.1300 కోట్ల ఇసుక సొమ్ము దోపిడీకి గురైందన్నారు.