కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి
NEWS May 20,2025 08:01 am
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి. విశాఖలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో సీనియర్లకు, కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొందరు వాపోయారు. దశాబ్దాలుగా పార్టీ ఉనికి కోసం శ్రమించామన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ ఆవేదన చెందారు. ఈ సందర్బంగా కిల్లి కృపారాణి మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన అంశాలను , ఫిర్యాదులను హైకమాండ్ దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.