తిరుమల భద్రతపై విస్తృత తనిఖీలు
NEWS May 20,2025 07:17 am
తిరుమల భద్రత, సేఫ్టీ మెథడ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు జిల్లా ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు. పోలీసు సిబ్బంది తోపాటు విజిలెన్స్ , హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి మెట్లు, ఆదిశేషు గెస్ట్ హౌస్, ఎమ్. బీ. సీ-34 ప్రాంతం తోపాటు ఎస్.ఎం. సి,ఏ.టీ.సీ. పరిసర ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.తిరుమలలోని బాంబు స్వ్కాడ్ , డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలను వేగవంతం చేశారు. ఇతర ప్రాంతాల నుండి కూలీ పనుల పై వచ్చి నివాసాలు ఉంటున్న వారి వివరాలు సేకరించారు.