జనుము జీలుగ విత్తనాలు పంపిణీకి సిద్ధం
NEWS May 20,2025 10:05 am
ఎండపల్లి మండలం లోని రైతులకు జనుము, జీలుగ విత్తనాలు మంగళవారం నుంచి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఎండపల్లి మండల వ్యవసాయ అధికారి కమల్ల మహేష్ తెలిపారు. రాజారాంపల్లి వ్యవసాయ రైతు కేంద్రం, ఎండపల్లి పిఎసిఎస్ లో పచ్చిరొట్ట సేద్యం కోసం ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 30 కిలోల జీలుగ విత్తనాలు ₹ 2137:50, 40 కిలోల జనుము విత్తనాలు ₹ 2510 రూపాయలకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తామన్నారు.