చరిత్రలో నిలిచి పోయేలా మహానాడు
NEWS May 19,2025 07:15 am
చరిత్రలో నిలిచి పోయేలా మహానాడును నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. ఈ నెల 27, 28, 28 తేదీల్లో కడపలోని పబ్బావరంలో నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సన్నాహాక సమావేశం చేపట్టారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తన ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన మహానాడు కంటే చరిత్రలో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.