హైదరాబాద్ లోని చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈమేరకు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు సాయంగా ప్రకటించామని తెలిపారు.