17కు చేరిన మృతుల సంఖ్య
NEWS May 18,2025 04:42 pm
చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. స్పాట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అభిషేక్ (30), ఆరూషి జైన్ (17)..హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్ (37), రాజేందర్(67), ప్రియాన్షీ(6), ప్రథమ్(13), సుమిత్ర (65)..మున్నీబాయ్ (72), ఇరాజ్(2) ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులే ఉన్నారు. బంధువుల ఇంటికి వచ్చారు. అనుకోకుండా అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు.