చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ అంటూ వ్యాపారులకు వల వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల మీద కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.