పదో తరగతి విద్యార్థి బాలగోని అక్షయ్ గౌడ్ అట్టలతో తెలంగాణ సచివాలయాన్ని రూపొందించి అబ్బురపరిచాడు. ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఓ ఐకన్ మాదిరిగా రూపుదిద్దుకుంది. అలాంటి క్లిష్టమైన సచివాలయం నిర్మాణానికి అట్టలతో నమూనా తయారు చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన అక్షయ్ని పలువురు అభినందిస్తున్నారు.