శ్రీవారిని దర్శించుకున్న గంభీర్
NEWS May 18,2025 12:49 pm
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. గంభీర్ తో పాటు ప్రముఖ సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. ఐశ్వర్య రాజేశ్, ఆది పినిశెట్టి, వైభవ్ , మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వామని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.