పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ రోజుతో సీజ్ఫైర్ ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. భారత్-పాక్ DGMOల మధ్య ఇవాళ ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని వెల్లడించింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 12న ఇరు దేశాల DGMOల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ప్రకటించింది.