జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో పోటీ పడనుంది. ఐపీఎల్ పునః ప్రారంభం సందర్బంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయింది. ఈ తరుణంలో 59వ మ్యాచ్ కు సిద్దమయ్యాయి ఇరు జట్లు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ ఆడతాడా లేదా అన్నది అనుమానం నెలకొంది. రాహుల్ ద్రవిడ్ వచ్చాక తనను పూర్తిగా పక్కన పెట్టేశాడు. వచ్చే సీజన్ లో నైనా తనను ఆడిస్తాడా లేదా అన్నది అనుమానంగా ఉందని ఫ్యాన్స్ మండి పడుతున్నాడు.