కోహ్లీ లాంటి ఆటగాళ్లకు కొదవ లేదు
NEWS May 18,2025 10:02 am
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువగా ప్రభావం చూపుతోందన్నాడు. పేదరికం నుంచి వచ్చిన ఆటగాళ్లు ఇవాళ కళ్ల ముందే కరోడ్ పతులుగా మారి పోతున్నారని, ఇదంతా క్రికెట్ వల్లనే కలుగుతోందన్నాడు. ఇదే సమయంలో భారత్ లో క్రికెట్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని, ఇందు కోసం ప్రయత్నం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. విరాట్ కోహ్లీ సూపర్ ప్లేయర్ అని, తనలాంటి ఆటగాళ్లు భారత దేశంలో చాలా మంది ఉన్నారని అన్నాడు.