తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత అని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా తిరుమలలో స్ఛచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అదనపు ఈవో తిరుమల స్థానికులకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించి వారి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.