సోషల్ మీడియా నియంత్రణ కోసం చట్టం
NEWS May 18,2025 08:01 am
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాక్ంగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా గురించి స్పందించారు. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, ఏది పడితే అది పోస్ట్ చేస్తూ డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకించి బీజేపీ, బీఆర్ఎస్ లను నియంత్రించేందుకు గాను కొత్తగా చట్టాన్ని తీసుకు రాబోతున్నామని స్పష్టం చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదనే సంగతి తెలుసుకుంటే మంచిదని నెటిజన్లు పేర్కొంటున్నారు.