ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలు, యువతకు తీపి కబురు చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం సీఎం తీపిక కబురు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.