యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
NEWS May 17,2025 04:42 pm
పాకిస్థాన్ కోసం జ్యోతి గూఢచర్యం చేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు భారతీయుల్ని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్ వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు విచారణలో తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం .