ధనంజయరెడ్డి ఎమ్మెల్యేలను గడ్డి పోచ లాగా చూశాడు
NEWS May 17,2025 03:34 pm
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసే వాడని ఆరోపించారు. సీఎంని కలవడానికి నేను క్యాంప్ ఆఫీసుకు వెళ్తే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు కూర్చో బెట్టాడని వాపోయాడు. పార్టీ కోసం పని చేసిన నాలాంటి వాళ్లను చాలా నీచంగా చూసే వాడన్నారు. షాడో సీఎం కాదు, ఆయనే సీఎంలాగా వ్యవహరించే వారంటూ ధ్వజమెత్తారు.