వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక
NEWS May 17,2025 03:21 pm
వచ్చే వారంలో ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక అందజేయనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ను సిద్ధం చేసిన కాళేశ్వరం కమిషన్. రాజకీయ నేతల విచారణ లేకుండానే కమిషన్ ముగించింది. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేసింది. వేల కోట్లు నీళ్ల పాలయ్యాయని ఆరోపించింది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో కమిషన్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నీళ్ల మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎం కేసీఆర్ , కాంట్రాక్టర్ లు కలిసి దోచుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.