ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EAPCET మే 19న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహించనున్నారు పరీక్షను. ప్రవేశ పరీక్షకు మొత్తం 3,62,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో కూడా రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్.