21న విశాఖ యోగా డేకు ప్రధాని
NEWS May 17,2025 08:42 am
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా ఏపీకి రానున్నారు పీఎం నరేంద్ర మోదీ. మే 21న ఘనంగా విశాఖపట్నంలో యోగా డే చేపట్టనున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా మంత్ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఊరు, పట్టణం, వాడ వాడలా యోగా ఉత్సవాలను చేపట్టాలన్నారు. నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేసే వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.