రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. అవినీతిని అరికడుతున్నామనే ఉద్దేశ్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. ఆ క్రమంలో నా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఆపాదించడం సరైంది కాదన్నారు. వాస్తవ పరిస్థితులను చూసుకుంటే అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనేని ఆరోపించారు.