తిరుపతి ఐఐటీకి రూ. 2,313 కోట్లు రిలీజ్
NEWS May 16,2025 09:35 am
కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు తిరుపతి ఐఐటీకి ఏకంగా భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. శుక్రవారం రూ. 2,313 కోట్లను రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో చదువుకుంటున్న 12 వేల మంది విద్యార్థులకు వసతి, విద్యాబోధనకు సర్వం సిద్ధం చేయనున్నారు. వీటిని ఖర్చు పెట్టనున్నారు.