సింధూ జలాలపై యథాతథ స్థితి
NEWS May 16,2025 07:00 am
కాల్పుల విరమణ ఎవురు కోరుకున్నారో అందరికి తెలుసు అని అన్నారు కేంద్ర మంత్రి జై శంకర్. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోందన్నారు. సింధూ జలాల నిలిపివేతపై యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు.