సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ
NEWS May 15,2025 08:53 pm
తెలంగాణలో ఆడవారిపై జరుగుతున్న అవమానకర సంఘటనలపై సోనియా గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ మాజీ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి. విదేశీ సుందరీమణుల కాళ్ళు కడిగించి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం బానిసత్వం వైపు నడిపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు, తల్లులకు, అక్కచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.