తెలంగాణలో కొత్తగా 28 బార్లు మంజూరు
NEWS May 15,2025 08:47 pm
తెలంగాణ సర్కార్ కొత్తగా 28 బార్లు మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీలకు ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులకు ఆహ్వానించింది ఎక్సై జ్ శాఖ. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు మళ్లీ అనుమతులు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించింది సర్కార్.